అక్రమ నిర్మాణాలపై కొరడా..గృహ ప్రవేశం రోజే ఇల్లు నేలమట్టం

అక్రమ నిర్మాణాలపై కొరడా..గృహ ప్రవేశం రోజే ఇల్లు నేలమట్టం

తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినా..నిభందనలకు విరుద్ధంగా కట్టినా ఎక్కడిక్కడ నేలమట్టం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఆక్రమించింది ఎంతటివారైనా వదలడం లేదు.. ఆక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు.  మే 30న గృహ ప్రవేశం చేసిన రోజే ఓ ఇల్లును కూల్చేశారు రెవెన్యూ అధికారులు. 

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని 947 సర్వే నెంబర్ లో ఇవాళ అక్రమ నిర్మాణాల కూల్చివేశారు అధికారులు.  పోలీసుల బందొబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ శాఖల సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు. ఈ రోజే  గృహప్రవేశం అయిన ఇంటిని సైతం కూల్చివేశారు అధికారులు. ప్రభుత్వ భూమిలో ఏలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా..వాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.

►ALSO READ | బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనేదే నా తపన.. బీజేపీలో విలీనం చేయొద్దు : కవిత

 హైదరాబాద్ లోనూ ఆక్రమ నిర్మాణాలు నేలమట్టంచేస్తోంది హైడ్రా. ప్రతి సోమవారం స్థానికుల నుంచి అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటోంది.