పీవీ, ఎన్టీఆర్ లపై బీజేపికి ప్రేమ ఉంటే భారతరత్నఇవ్వాలి

పీవీ, ఎన్టీఆర్ లపై బీజేపికి ప్రేమ ఉంటే భారతరత్నఇవ్వాలి

నిజంగా పీవీ, ఎన్టీఆర్ లపై బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ-ఎంఐఎంలు తుచ్ఛరాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తుందన్నారు.  29న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలన్నారు. ప్రతి రోజు రాత్రి బండి సంజయ్, అరవింద్ , అసద్, అక్బర్ ల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తుందని… దీనికి సంధానకర్తగా అమిత్ షా వ్యవహరిస్తున్నారన్నారు. రాత్రి పూట అంతా  కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదన్నారు.  ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు రేవంత్.