రూ.20 వేల కోట్ల రిలయన్స్‌‌ బాండ్స్ ఇష్యూ!

రూ.20 వేల కోట్ల రిలయన్స్‌‌ బాండ్స్ ఇష్యూ!

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ బాండ్ల మెచ్యూరిటీ పదేళ్లని బ్లూమ్‌‌బర్గ్‌‌ రిపోర్ట్ చేసింది. ఒక  ప్రైవేట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఇష్యూ చేసిన అతిపెద్ద బాండ్ సేల్‌‌గా ఇది నిలవనుంది.

ఈ బాండ్లు నవంబర్‌‌‌‌ 10, 2033 లో దశల వారీగా మెచ్యూర్ అవుతాయని, రూ. లక్ష ఫేస్ వాల్యూ ఉన్న నాన్‌‌ కన్వర్టబుల్ బాండ్ల (ఎన్‌‌సీడీల) ను ఇష్యూ చేయనుందని బ్లూమ్‌‌బర్గ్‌‌ తెలిపింది.  ఎన్‌‌సీడీ సేల్ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌ను ఈ ఏడాది మెచ్యూర్ కానున్న అప్పులను రీఫైనాన్స్ చేయడానికి వాడనున్నారు. రిలయన్స్ ఇష్యూ చేసే బాండ్లకు కేర్‌‌‌‌ఎడ్జ్‌‌, క్రిసిల్ ‘ఏఏఏ’ రేటింగ్ ఇచ్చాయి.