మళ్లీ పెరిగిన ఉల్లి ధరలు

మళ్లీ పెరిగిన ఉల్లి ధరలు

ఉత్తర్ ప్రదేశ్: ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. UPలోని వారనాసి బహిరంగ మార్కెట్ లో కేజీ 50 రూపాయలకు చేరింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్ లో కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన ఉల్లిధర.. ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. దీంతో ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. అయితే మార్కెట్లో భారీ ధర పలుకుతున్నా… పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు కావటం లేదు…ఉల్లి రేట్లు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.  అటు ప్రభుత్వం ఉల్లి రేట్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.