మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, లీటర్ డీజిల్ పై 28 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ముంబై సహా భోపాల్, థానేలో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. ముంబైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 47 పైసలకు పెరిగింది.

లీటర్ డీదిల్ 92 రూపాయల 45 పైసలకు చేరింది. ఇక భోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 34 పైసలుగా ఉండగా...డీజిల్ ధర 93 రూపాయల 37 పైసలకు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 23 పైసలు, లీటర్ డీజిల్ ధర 85 రూపాయల 15 పైసలుగా ఉంది. ఈ నెలలో ఓవర్ ఆల్ గా పెట్రోల్ పై 3 రూపాయల 83 పైసలు, డీజిల్ పై 4 రూపాయల 42 పైసలు పెరిగింది.