ఆర్ఎంపీ ట్రీట్ మెంట్ .. పాప మృతి ..జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

ఆర్ఎంపీ ట్రీట్ మెంట్ .. పాప మృతి ..జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
  • క్లినిక్​ సీజ్ చేసిన ఆఫీసర్లు

గద్వాల, వెలుగు: ఆర్ఎంపీ ట్రీట్​మెంట్ వికటించి ఐదేండ్ల పాప చనిపోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన నిఖిత(5)కు జ్వరం రావడంతో బుధవారం స్థానిక ఆర్ఎంపీ నరసింహ వద్దకు తీసుకెళ్లారు. పాపకు హై  డోస్ ఇంజక్షన్​ఇవ్వడంతో  వికటించి చనిపోయింది. విషయం తెలియడంతో  కలెక్టర్​సంతోష్​ స్పందించి విచారణకు ఆదేశించారు. డాక్టర్లు ప్రసన్న రాణి, సంధ్య కిరణ్మయి వెళ్లి క్లినిక్​లో విచారించారు.  హై డోస్ ఇంజక్షన్​ఇవ్వడంతోనే పాప చనిపోయిందని గుర్తించారు. క్లినిక్​ను సీజ్​చేసి, ఆర్ఎంపీ నరసింహపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్లు తెలిపారు.