ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరి మృతి

 ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరి మృతి

గండిపేట నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన టాటా ఏస్ వాహనం డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. ముగ్గురూకి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూకుసు రావడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద అంబర్ పేట్ నుండి గచ్చిబౌలి వైపు వెళుతుండగా వాహనం ప్రమాదానికి గురైంది.