ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ–కొత్తగూడెం జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 43 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైయ్యాయి. లారీ ఢీ కొట్టడంతో బస్సు మూడు పల్టీలు కొట్టింది. 

ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి ఓ ఆర్టీసీ బస్సు 47 మంది  ప్రయాణికులతో విజయవాడ బయల్దేరింది. కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఆనందగనికి వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మెుత్తం ప్రయాణికుల్లో 43 మంది గాయపడ్డారు.   

 ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అక్కడున్న స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.