దిల్ సుఖ్ నగర్, వెలుగు: ప్రమాదవశాత్తు బైక్డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్, టెలిఫోన్ కాలనీ ప్రాంతాలకు చెందిన మధు, హరీశ్స్నేహితులు. వీరిద్దరు శనివారం బయటికి వెళ్లి రాత్రి బైక్పై ఇంటికి వస్తున్నారు. విక్టోరియా మెమోరియల్ స్కూల్ మెట్రో స్టేషన్ సమీపంలో 1618 నంబర్ పిల్లర్ వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లో మృతిచెందారు. పోలీసులు డెడ్బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
