భూత్పూర్, వెలుగు: బైక్ అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మహబూబ్నగర్జిల్లా భూత్పూర్మండల కేంద్రానికి చెందిన బజారు ఆనంద్(24), ఇతడి అక్క నాగమణి(25), మేనత్త లక్ష్మమ్మ (60) బైక్పై మంగళవారం ఉదయం మహబూబ్నగర్ వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి బయల్దేరారు. భూత్పూర్కు చేరుకోగానే క్రాసింగ్వద్ద బైక్ను కంట్రోల్ చేయలేక వేగంగా వచ్చి డివైడర్ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముడితో పాటు మేనత్త చనిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భూత్పూర్సీఐ రజితారెడ్డి, ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు.
డిచ్పల్లి వద్ద...
డిచ్పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద ఎన్హెచ్ 44 పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న రెండు బైక్లను కంటైనర్ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మోపాల్ మండలం కులాస్పూర్కు చెందిన పోగుల శ్యామ్, ఇతడి భార్య నవ్య, కొడుకు రుషి, కూతురు సమన్వి సుద్దపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి గ్రామానికి బైక్పై వస్తుండగా హైవే పై ఓవర్స్పీడ్తో వస్తున్న కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానకు తరలిస్తుండగా నవ్య, సమన్వి(8) చనిపోయారు. యాక్సిడెంట్ చేసి ముందుకు వెళ్లిన కంటైనర్ మరో బైక్ని ఢీకొట్టడంతో బైక్పై ఉన్న జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి కి చెందిన కుర్మా సాయిలు(55) చనిపోయాడు. కంటైనర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.