మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ZP రోడ్డు లో బైక్ ను టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
మద్దిగట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ (55) తన కొడుకు, కొడలుతో కలిసి ZP రోడ్డు లో ఉన్న బ్యాంకుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా.. వెనుక నుంచి స్పీడ్ గా వచ్చిన టిప్పర్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న లక్ష్మీ టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు, కొడలు మరోపక్క పడటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.