ఆటోను ఢీకొన్న టూరిస్ట్ బస్సు-15 మందికి గాయాలు

ఆటోను ఢీకొన్న టూరిస్ట్ బస్సు-15 మందికి గాయాలు

కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఆటోను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు నుంచి శ్రీశైలం వస్తున్న టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చిన్నారుట్ల వద్ద ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు, బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిక తరలించారు స్థానికులు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.