సిద్దిపేట: కారు ఢీకొని బైక్పై వెళ్తున్న భార్యభర్తలు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గజ్వేల్ మండలం షేర్పల్లికి చెందిన ప్రవీణ్ (50), జ్యోతి (45) భార్యభర్తలు. సోమవారం (మే 18) పని నిమిత్తం ఇద్దరు కలిసి బైక్పై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో గజ్వేల్ సమీపంలోని పత్తి మిల్ దగ్గర ప్రమాదానికి గురయ్యారు.
కారు ఢీకొని భార్యభర్తలు చనిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
