కాల్పులు జరిపి ఏటీఎం చోరీ

కాల్పులు జరిపి ఏటీఎం చోరీ

కూకట్ పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. అల్వీన్ కాలనీలోని హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులను నింపే సమయంలో  బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతుకులు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి దుండగులు నగదును ఎత్తుకెళ్లారు. వారిలో సెక్యూరిటీ గార్డు అలీ మృతిచెందగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కాల్పులు జరిపిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.