
జీడిమెట్ల, వెలుగు: ఆన్లైన్బెట్టింగ్కు అలవాటు పడి సొంత అన్న ఇంట్లో దొంగతనం చేసిన చెల్లిని, ఆమెకు సహకరించిన ఇద్దరిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్చేశారు. జగద్గిరిగుట్ట పరిధిలోని షిరిడీ హిల్స్లో వేముల శ్రీకాంత్తన భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మంఘాట్లో ఉండగా, వారు కొత్త కారు కొనడంతో పూజ కోసం ఈ నెల 6న అక్కడికి వెళ్లాడు.
పూజకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని 12 తులాల బంగారం, వెండి, నగదు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తన చెల్లినే ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమె గత 8 ఏండ్లుగా భర్తకు దూరంగా ఉంటూ తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఆన్ లైన్బెట్టింగ్కు అలవాటుపడి రూ.5 లక్షల వరకూ అప్పుల పాలైంది. శ్రీకాంత్కు అతని చెల్లెలుకు మనస్పర్థలు ఉండటంతో అన్న ఇంట్లో దొంగతనం చేసి అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. అన్న, వదినలు ఇంటికి రాగానే వదిన పర్స్లోని తాళం చెవిని తీసి షూ రాక్లో దాచిపెట్టింది.
రాత్రి అందరూ పడుకున్నాక తన ప్లాన్ ప్రకారం స్నేహితులైన కార్తిక్, అఖిల్ పిలిచి జగద్గిరిగుట్టలోని అన్న ఇంటి తాళం చెవి ఇచ్చింది. దీంతో వారు వెళ్లి బంగారం, వెండి, నగదును దొంగలించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.