టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం, కర్ణాటక తరుపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలిపాడు. 20 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరించి, ప్రోత్సహించిన వారికి ఉతప్ప కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్ లో తాను ఆడిన కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం 36 ఏళ్లున్న ఉతప్ప... ఇండియా తరుపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. 2007లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఉతప్ప కీ రోల్ ప్లే చేశాడు.
It has been my greatest honour to represent my country and my state, Karnataka. However, all good things must come to an end, and with a grateful heart, I have decided to retire from all forms of Indian cricket.
— Robin Aiyuda Uthappa (@robbieuthappa) September 14, 2022
Thank you all ❤️ pic.twitter.com/GvWrIx2NRs