
- వివరాలు వెల్లడించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
- గౌరవ సలహాదారుదుగ్గెంపూడి రవీందర్ రెడ్డి
ఖైరతాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం మండలం సీతమ్మలొద్దిలో లక్షలాది సంవత్సరాల నాటి విలువైన రాతిచిత్రాలను, పనిముట్లను గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గౌరవ సలహాదారులు దుగ్గెంపూడి రవీందర్ రెడ్డి తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాతిచిత్రాల నిపుణులు, నాణకవేత్త (న్యూమిస్మాటిస్ట్) డాక్టర్ బండి మురళీధర్ రెడ్డితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.
గట్టుసింగారం గ్రామానికి ఆనుకొని ఉన్న దట్టమైన అడవిలో 50 అడుగుల ఎత్తు, వెయ్యి అడుగుల పొడవున్న పడిగెరాయి, ఇసుకరాతి గుహ, 200 అడుగుల పొడవున్న ఆరు పడిగెరాయి కప్పులతో కూడిన గుహలను, వందలాది రాతిచిత్రాలు, రాతియుగం నాటి పనిముట్లను గుర్తించామన్నారు. 1 నుంచి 6వ శతాబ్దం వరకు వేసిన ఎరుపురంగు, తెలుపు, పసుపురంగుల రాత్రి చిత్రాలను గుర్తించామని తెలిపారు. తొందరలోనే దీనిపై మరింత అధ్యయనం చేస్తామన్నారు.