
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులు సమష్టి కృషితో పని చేసి కరెంటు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ కార్యదర్శి ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. విద్యుత్ సంస్థల పురోగతిలో ఇంజినీర్లు, అధికారులు భాగస్వామ్యం కావాలని చెప్పారు. బుధవారం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇంజినీర్ల సంఘాల నేతలు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎండీ రొనాల్డ్ రోస్ మాట్లాడారు. కరెంటు ఉద్యోగులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అకౌంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. సుబ్బయ్య, పవర్ ఇంజినీర్స్ జేఏసీ ప్రెసిడెంట్ ఎ. వెంకట్ నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ పి. సదానందం, వీఏఓఏటీ వైస్ ప్రెసిడెంట్నాజర్ షరీఫ్, జాయింట్ సెక్రటరీ పరమేశ్, సీహెచ్అనురాధ, స్వామి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ ప్రసాద్, వెంకటేశ్, ప్రశాంత్, రాజు, పవర్ జేఏసీ నాయకులు కె. కిరణ్ కుమార్, గోపాల్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.