రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో సినిమా ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ మూవీకి మిక్సెడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అంతేకాకుండా ఓ వైపు బాలకృష్ణ అఖండ 2, మరోవైపు రణవీర్ సింగ్ 'ధురంధర్' వంటి బడా సినిమాల మధ్య నలిగిపోయింది. ఈ క్రమంలో ఆ సినిమాలతో మోగ్లీ టఫ్ ఫైట్ ఎదుర్కొని థియేటర్ రన్ మధ్యలోనే ముగించింది. దీంతో మోగ్లీ రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది.
లేటెస్ట్గా మోగ్లీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ స్పెషల్గా జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ వెల్లడించింది. ‘ప్రతీ హీరో నగరంలోనే పుట్టడు. కొందరు అడవి నుంచి పుడతారు’ అంటూ క్యాప్షన్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.
Not every hero is born in the city.
— ETV Win (@etvwin) December 26, 2025
Some rise from the wild. 🌿#Mowgli2025
Premieres from January 1st, exclusively on @etvwin. 🎬
A @SandeepRaaaj cinema. 🎥
A @kaalabhairava7 musical. 🎶
🌟ing @RoshanKanakala @publicstar_bsk @SakshiMhadolkar @harshachemudu
🎁 Special Launch… pic.twitter.com/oVbPJNWmbC
ఎందుకు ఈ పరిస్థితి?
చాలా మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు 3–5 వారాల (సాధారణంగా 4 వారాలు) లోపలే ఓటీటీ ప్లాట్ఫార్మ్లలోకి వస్తున్నాయి. ఇంకొన్ని చిన్న సినిమాలైతే, కేవలం 20 నుంచి 30 రోజుల్లోనే స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఇపుడు మోగ్లీకి కూడా బాక్స్ ఆఫీస్ అంచనాల మేరకు పెద్ద విజయం దక్కలేదు. ఈ క్రమంలో త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనే ఉద్దేశ్యంతో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు టాక్.
సినిమాలు త్వరగా ఓటీటీకి రావడానికి కారణాలు:
- థియేటర్ కలెక్షన్లు తగ్గిపోతే త్వరగా ఓటీటీకి అమ్మేయడం
- ఓటీటీ డీల్స్ ముందే ఫిక్స్ అవడం
- ప్రేక్షకుల అభిరుచులు మారడం (ఇంట్లోనే చూడటం ఇష్టపడటం)
- నిర్మాతలు రిస్క్ తగ్గించుకోవడం
ఇదిలా ఉంటే.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీగా ‘మోగ్లీ’ తెరకెక్కింది. రామాయణం, కర్మ సిద్ధాంతానికి ముడిపెడుతూ తెరకెక్కించిన విధానం ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది. కంటెంట్కి ప్రాధాన్యత ఉండటంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
హీరో రోషన్ కనకాల యాక్షన్, ఎమోషన్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. తన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. విలన్ పాత్రలో చేసిన బండి సరోజ్ కుమార్ పెర్ఫార్మెన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీరితోపాటు వైవా హర్ష, కృష్ణ భగవాన్ కీలక పాత్రలు పోషించారు. హీరో సుహాస్, రియా సుమన్ గెస్ట్ రోల్స్లో ఆకట్టుకున్నారు.
కథేంటంటే:
పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతం. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాడు మోగ్లీ ఉరఫ్ మురళి (రోషన్ కనకాల). అతను ఒక అనాథ. అడవినే తల్లిగా భావించే మోగ్లీ ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. అలా జీవనం సాగించుట కొరకు బెస్ట్ ఫ్రెండ్ అయిన బంటి (వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్కి వెళుతుంటాడు. అక్కడ జూనియర్ ఆర్టిస్టులను చేరవేయడం అతని పని. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్లో భాగంగా డూప్గా నటించాల్సి వస్తుంది మోగ్లీ. ఇక అదే సినిమా టీమ్లోని సైడ్ డ్యాన్సర్ జాస్మిత్ (సాక్షి మడోల్కర్)తో లవ్లో పడతాడు.
అయితే, ఆమెకు చెవులు వినపడవు. మాటలు రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. అలా సీతరాముల్లాంటి ఈ జంట మధ్యలోకి రావణుడిలా ఎంట్రీ ఇస్తాడు SI క్రిప్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్). నోలన్ రాకతో జాస్మిత్ లైఫ్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో నోలన్, హీరోయిన్ జాస్మిత్పై మోజు పడతాడు. ఎలాగైనా ఆమెను వాడుకోవాలని ఎన్నో పథకాలు వేస్తాడు. ఇలా జాస్మిత్-మోగ్లీ జంటని ఎన్నో చిత్రహింసలు పెడతాడు.
ఇలాంటి అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి.. ప్రియురాలు జాస్మిత్ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి జాస్మిత్-మోగ్లీ ప్రేమ గెలిచిందా లేదా? అడవిని నమ్ముకుని బ్రతికే మోగ్లీకి.. ఆ దైవం ఎలాంటి ధైర్యం ఇచ్చింది? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
