స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని థ్రిల్ సిటీ, నెక్లెస్ రోడ్లో 'ట్రై కలర్ వాక్'లో స్టూడెంట్స్, యూత్ ఉత్సాహంగా పాల్గొన్నారు. 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో మానవ హారం నిర్వహించారు.
ఈ ర్యాలీ హైదరాబాద్లోని పలు ప్రాంతాలను టచ్చేస్తూ వెళ్లింది. రోటరీ క్లబ్లాంటి పలు స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జెండా పండగ వేడుకల కోసం సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలను రంగురంగుల లైట్లతో అలంకరించింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జెండా పండగని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎస్ శాంతకుమారి అధికారులను ఆదేశించారు.