హుస్సేన్​సాగర్​ ఒడ్డున తిరంగా ర్యాలీ

హుస్సేన్​సాగర్​ ఒడ్డున తిరంగా ర్యాలీ

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​లోని  థ్రిల్ సిటీ, నెక్లెస్ రోడ్‌లో  'ట్రై కలర్ వాక్'లో స్టూడెంట్స్, యూత్​ ఉత్సాహంగా పాల్గొన్నారు. 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో మానవ హారం నిర్వహించారు. 

ఈ ర్యాలీ హైదరాబాద్​లోని పలు ప్రాంతాలను టచ్​చేస్తూ వెళ్లింది. రోటరీ క్లబ్​లాంటి పలు  స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్​ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జెండా పండగ వేడుకల కోసం సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలను రంగురంగుల లైట్లతో అలంకరించింది. 

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జెండా పండగని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎస్​ శాంతకుమారి అధికారులను ఆదేశించారు.