
హర్ష నర్రా(Harsha Narra), మేఘలేఖ(Megha lekha) జంటగా సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, ఖుష్బూ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం కలిసి నిర్మిస్తున్నారు.
మార్చి 22న వరల్డ్వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నలుగురు స్నేహితుల కథ ఇది. ఈ జనరేషన్ను ఆకట్టుకునే యూత్ఫుల్ ఎంటర్టైనర్. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి’ అని చెప్పాడు. హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.