హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా వేదికగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తులసీ చంద్ను కొంతమంది కించపరుస్తూ అవమానకర కామెంట్లు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని సీనియర్జర్నలిస్టులు మండిపడ్డారు. తులసీ చంద్కు మద్దతుగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘జర్నలిజం–-ట్రోల్ ముఠాలు’ అనే అంశంపై వివిధ జర్నలిస్ట్ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు అమర్, సీనియర్జర్నలిస్టులుకె. శ్రీనివాస్, రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రోలింగ్ ముఠాలు ఓ ఆర్గనైజేషన్గా ఏర్పడి కొందరిని టార్గెట్ చేసి వారిపై అవమానకర పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎక్కువ ప్రశ్నిస్తారని, అందుకే తులసిపై అవమానకర పోస్టులు, దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.