కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేసే క్రమంలో డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది ఎవరైనా మరణిస్తే .. ఆ ఫ్యామిలీకి రూ. కోటీ ఆర్ధిక సాయం అందిస్తామని తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వారు ప్రభుత్వం, ప్రైవేటు రంగం అనే సంబంధం లేకుండా మొత్తాన్ని అందజేస్తామని చెప్పారు.
కరోనైపై వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదన్న సీఎం..ఢిల్లీలో ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో మొత్తం 120 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలని సూచించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.