తొర్రూర్ లో భారీగా నగదు పట్టివేత..

 తొర్రూర్ లో భారీగా నగదు పట్టివేత..

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో భారీగా నగదు పట్టుబడింది. తొర్రూరు పట్టణ కేంద్రంలో 2023, నవంబర్ 25వ తేదీ శనివారం ఎన్నికల అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. 

ఈ క్రమంలో  TS 09 FB1609 నెంబర్ గల ఇన్నోవా కారులో తరలిస్తున్న సుమారు ఒక కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  సరైన పత్రాలు లేని వందల కోట్ల రూపాయలతోపాటు భారీగా బంగారు నగలను అధికారులు పట్టుకున్నారు.