బ్యాంకు డిపాజిట్లపై రూ.లక్ష బీమా

బ్యాంకు డిపాజిట్లపై రూ.లక్ష బీమా

బ్యాంకుల్లో ఖాతాదారులు జమచేసుకున్న తమ డిపాజిట్లపై బీమా వర్తింపు రూ.లక్ష వరకే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(DICGC) తెలిపింది. ఇటీవల బ్యాంకు ఖాతాదారులకు వర్తించే బీమాకు సంబంధించి సమాచార హక్కు ద్వారా దాఖలు చేసిన పిటిషన్ కు DICGC సమాధానమిచ్చింది. DICGC చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ లక్ష రూపాయలవరకు బీమా కవరేజీ అందిస్తోంది. పొదుపు, పిక్స్ డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లకు ఈ బీమా వర్తిస్తుందని చెప్పింది.