దసరా పండుగ సందర్భంగా వైన్షాపుల యజమానులు ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మితే రూ.2 లక్షల ఫైన్ వేయడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లోని 8 వైన్ షాపుల్లో ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మినట్టుగా గుర్తించామని తెలిపింది. దసరా పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్ షాపు యజమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎక్సైజ్ స్టేషన్లకు అదనంగా స్టేట్ టాస్క్ఫోర్స్ టీంలు నాలుగు, ఎన్ఫోర్స్మెంట్ టీంలు పది, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీంలు 34 ఏర్పాటు చేశామని చెప్పింది. ఎమ్మార్పీకి మించి అమ్మే వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్లో స్టేట్ కంట్రోల్ సెంటర్తో పాటు పాత పది జిల్లాల్లో పది కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఫిర్యాదులు అందగానే దాడులు చేయాలని ఎస్హెచ్వోలు, జిల్లా ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది.
ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు
స్టేట్ కంట్రోల్ రూం: 040–-24733056
హైదరాబాద్: 040-–24746884
రంగారెడ్డి: 040–24600450
ఆదిలాబాద్: 08732–220229
నిజామాబాద్: 08762–237551
మెదక్: 08455–-271232
నల్గొండ: 08682–224271
మహబూబ్నగర్: 08542–242488
వరంగల్: 08702–577412
కరీంనగర్: 08782–262330
ఖమ్మం: 08742–224342