రూ.21 లక్షల విలువైన టమాటాలు మిస్సింగ్

రూ.21 లక్షల విలువైన టమాటాలు మిస్సింగ్

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్నాయి.  తాజాగా కోలార్ నుంచి జైపూర్‌కు తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన 11 టన్నుల కూరగాయలు మాయమయ్యాయి. ముగ్గురు వ్యాపారులు రూ.21లక్షల విలువైన 735 టమాటా బాక్సులను కొనుగోలు చేశారు. 15 కిలోల బరువున్న ఈ ఒక్కో టమాటా బాక్సును రూ.2 వేల నుంచి రూ.2,150కి కొనుగోలు చేశారు. వాటిని 2023 జులై 27వ తేదీన మధ్యాహ్నం సమయంలో లోడ్ చేసి.. రాజస్థాన్ లోని కోలార్ నుంచి జైపూర్ కు తరలించారు. 

అయితే ఇందుకోసం ఓ ప్రైవేటు రవాణాను వినియోగించారు. లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ఇతర వివరాలను తీసుకున్నారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి 11 గంటలకంతా జైపూర్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే కోలార్ నుంచి బయల్దేరిన తర్వాత శనివారం ఉదయం వరకూ వ్యాపారులతో టచ్ లో ఉన్న డ్రైవర్.. మధ్యాహ్నం తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు. ట్రక్కుకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. 

దీంతో ఆందోళన చెందిన వ్యాపారులు వెంటనే కోలార్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.  వ్యాపారి మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోలార్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఇలాంటి దొంగతనం జరగడం ఇది మొదటిదేం  కాదు. జూలై నెల ప్రారంభంలో బెంగళూరు నుంచి కోలార్‌కు జీపులో తరలిస్తున్న రూ.2 లక్షల విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి. జిల్లాలో విస్తారమైన భూముల్లో టమాటా పండించే రైతులు, కూరగాయలతో కూడిన డబ్బాలను దుండగులు దొంగిలిస్తారనే భయంతో రాత్రంతా తమ పంటలను కాపాడుకుంటున్నారు. తమ పొలాల దగ్గర గుడారాలు వేసుకుని గత కొన్ని రోజులుగా కాపలా కాస్తున్నారు