విమానరంగానికి రూ. 22,400 కోట్ల నష్టాలు

విమానరంగానికి రూ. 22,400 కోట్ల నష్టాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా  దేశంలోని ఎయిర్​లైన్స్​, ఎయిర్​పోర్టులు రూ. 22,400 కోట్ల నష్టాల పాలయినట్లు అఫీషియల్​ డేటా వెల్లడించింది. ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) కింద నడుస్తున్న ఎయిర్​పోర్టులలో 75 శాతం నష్టాలతోనే నడుస్తున్నట్లు డేటా చెబుతోంది. ఏఏఐ రెవెన్యూ కూడా ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో రూ. 889 కోట్లకు తగ్గిపోయినట్లు సివిల్​ ఏవియేషన్ సహాయ మంత్రి వీ కే సింగ్​ గురువారం లోక్​సభకు వెల్లడించారు. కరోనా దెబ్బకు గ్లోబల్​గాను, దేశంలోనూ కూడా ఏవియేషన్​ సెక్టార్​ కకావికలమైందని, ఫైనాన్షియల్​గా ఇబ్బందులలో పడిందని ఆయన చెప్పారు. ఎయిర్​లైన్స్​, ఎయిర్​పోర్టులు 2019–20లో రూ. 19 వేల కోట్లు, 2020–21లో రూ. 3,400 కోట్లు నష్టం పొందినట్లు పేర్కొన్నారు. ఏఏఐ రెవెన్యూ అంతకు ముందు ఏడాదిలోని రూ. 2976 కోట్ల నుంచి ఏకంగా రూ. 889 కోట్లకు పడిపోయిందని చెప్పారు. కరోనా వైరస్​ వల్ల దేశీయ ప్యాసెంజర్​ ట్రాఫిక్​ 2019–20లో 0.3 శాతం, 2020–21లో 61.7 శాతం పడిపోయినట్లు వెల్లడించారు. కరోనా ఎఫెక్ట్​ తగ్గితే రాబోయే కొన్నేళ్లలో ఎయిర్​ప్యాసెంజర్​ ట్రాఫిక్​ రెట్టింపయ్యే అవకాశం ఉందని సింగ్​ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్​ చురుగ్గా సాగుతున్నందు వల్ల ఎయిర్​ ట్రాఫిక్​పై తక్కు ప్రభావమే ఉంటుందని అంచనా వేశారు.