దళితబంధుకు మరో 500 కోట్లు విడుదల

దళితబంధుకు మరో 500 కోట్లు విడుదల

దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పతకం కోసం నేడు మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. అందుకోసం మొదటి విడతలో 500 కోట్లు విడుదల చేయగా.. ఇవాళ మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ పథకం కోసం ఓవరాల్ గా వెయ్యి కోట్లు విడుదల చేసింది. కాగా.. మరో వారం రోజుల్లో మరో వెయ్యి కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు కరీంనగర్ కలెక్టరేట్ లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో దళితబంధు అమలుపై కలెక్టర్ RV కర్ణన్ రివ్యూ చేయనున్నారు. తెలంగాణ దళితబంధు పేరుతో లబ్ధిదారుల పేరిట ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తెరవాలని నిర్ణయించారు.