వాటర్ వేస్ట్ చేశాడని.. కోహ్లీకి రూ.500 ఫైన్!

వాటర్ వేస్ట్ చేశాడని.. కోహ్లీకి రూ.500 ఫైన్!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి రూ.5వందల జరిమానా విధించారు అధికారులు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీకి.. ఈ చలానా నోటీసు జారీచేశారు మనదేశంలోని గుర్గావ్ కార్పొరేషన్ అధికారులు.

విరాట్ కోహ్లీ ఇంట్లో కార్లను కడిగేందుకు.. ఇంటి సిబ్బంది లీటర్లకొద్దీ మంచినీరును వాడుతున్నారని గుర్గావ్ కార్పొరేషన్ కు చుట్టుపక్కల వాళ్లు కంప్లయింట్ చేశారు. అసలే ఎండాకాలం నీళ్లు దొరకడం లేదని బాధపడుతుంటే… తాగునీటిని కోహ్లీ ఇంట్లో కార్లు కడిగేందుకు ఉపయోగిస్తున్నారని స్థానికులు  ఆరోపించారు. ఫిర్యాదు తీసుకున్న అధికారులు.. విరాట్ కోహ్లీకి రూ.5వందల జరిమానా విధిస్తూ చలాన్ పంపించారు.