తెలంగాణ బిడ్డల వెతలు చూస్తుంటే బాధేస్తుంది : ఆర్ఎస్ ప్రవీణ్

తెలంగాణ బిడ్డల వెతలు చూస్తుంటే బాధేస్తుంది : ఆర్ఎస్ ప్రవీణ్

తెలంగాణ బిడ్డల వెతలు చూస్తుంటే చాలా బాధేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. V6 వెలుగు పేపర్లో వచ్చిన గాడితప్పిన సదువులు ఆర్టికల్ను ఆయన ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రేమో బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీ లాబీయింగ్ లో బిజీగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రేమో మునుగోడులో ఓటర్లను, లీడర్లను కొనడంలో బిజీగా ఉన్నారు. అధికారులేమో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ పేద బిడ్డల గురించి ఎవరాలొచిస్తరు’’ అని ట్వీట్ చేశారు. దీనికి #KCRQuitTelangana హ్యాష్ ట్యాగ్ను జోడించారు.