- టీఎస్పీఎస్సీ లీకేజీపై సైలెంట్ ఎందుకు ?
- డీజీపీ, సిటీ సీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో ఇద్దరే సూత్రధారులంటూ సిట్ ఇచ్చిన నివేదికపై బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గురువారం స్పందించారు. కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్న సిట్ నుంచి ఇంత కంటే ఎక్కువ ఏం ఆశించగలమని ట్విట్టర్లో అసహనం వ్యక్తం చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ జరిగిన 48 గంటల్లో వరంగల్ సీపీ ప్రెస్మీట్ పెట్టారని.. మరి టీఎస్ పీఎస్సీ లీకేజీ జరిగి నెలైనా డీజీపీ, హైదరాబాద్ సిటీ సీపీ ఎందుకు సైలెంటుగా ఉన్నారని ప్రశ్నించారు. ‘లీకేజీలో సూత్రధారులు ఇద్దరే’ అనే శీర్షికతో ‘వెలుగు’లో వచ్చిన కథనాన్ని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్కు జతచేశారు.