టీఎస్‌‌‌‌పీఎస్సీ లీకేజీపై సైలెంట్ ఎందుకు ? : ఆర్ఎస్ ప్రవీణ్

టీఎస్‌‌‌‌పీఎస్సీ లీకేజీపై సైలెంట్ ఎందుకు ? : ఆర్ఎస్ ప్రవీణ్
  • టీఎస్‌‌‌‌పీఎస్సీ లీకేజీపై సైలెంట్ ఎందుకు ?
  • డీజీపీ, సిటీ సీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు : టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీలో ఇద్దరే సూత్రధారులంటూ సిట్ ఇచ్చిన నివేదికపై బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ గురువారం స్పందించారు. కేసీఆర్  కనుసన్నల్లో నడుస్తున్న సిట్ నుంచి ఇంత కంటే ఎక్కువ ఏం ఆశించగలమని ట్విట్టర్‌‌‌‌లో అసహనం వ్యక్తం చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ జరిగిన 48 గంటల్లో వరంగల్ సీపీ ప్రెస్​మీట్ పెట్టారని.. మరి టీఎస్‌‌‌‌ పీఎస్సీ లీకేజీ జరిగి నెలైనా డీజీపీ, హైదరాబాద్ సిటీ సీపీ ఎందుకు సైలెంటుగా ఉన్నారని ప్రశ్నించారు. ‘లీకేజీలో సూత్రధారులు ఇద్దరే’ అనే శీర్షికతో ‘వెలుగు’లో  వచ్చిన కథనాన్ని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్​కు జతచేశారు.