బీఎస్పీ సభ చరిత్రలో నిలవాలి

బీఎస్పీ సభ చరిత్రలో నిలవాలి

బహుజన రాజ్యం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 8న నల్గొండలో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్య అతిథిగా మాయవతి రానున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 8న జరగనున్న బీఎస్పీ పార్టీ సభ చరిత్రలో నిలవాలన్నారు. మాయావతి ప్రధాని అవుతారు అనడానికి..సభ సంకేతం కావాలన్నారు ప్రవీణ్ కుమార్ . బహుజన రాజ్యం రావాలంటే.. ప్రతి కార్యకర్త ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలన్నారు.