రాష్ట్రానికి BJP నుంచి రక్షణ BSPనే ఇవ్వగలదు: RS ప్రవీణ్ కుమార్

రాష్ట్రానికి BJP నుంచి రక్షణ BSPనే ఇవ్వగలదు: RS ప్రవీణ్ కుమార్

తెలంగాణకు బీజేపీ నుండి రక్షణ కేవలం బీఎస్పీనే ఇవ్వగలదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్, బీఆర్ఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు రక్షణ ఇవ్వలేదన్నారు. బీజేపీ మత విద్వేష- బీసీ వ్యతిరేక- రాజ్యాంగ వ్యతిరేక విధానాలు నచ్చక ఇవాళ  బీఎస్పీలో లో చేరిన నారాయణ పేట - ఘన్ముక్ల ప్రజలకు అభినందనలు తెలిపారు. 


పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను... రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో లాక్కొంటోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు.  నారాయణపేట జిల్లా మరికల్ లో పర్యటించిన ఆయన... 449 సర్వే నంబర్ లోని భూబాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిత్తనూరులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ బయో డీజిల్ కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు ప్రవీణ్ కుమార్. మంత్రి  కేటీఆర్ బినామీలే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.