ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మే 29వ తేదీ సోమవారం మంచిర్యాల జిల్లాలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని.. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 

ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించేవరకు తాము పోరాడుతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో జూన్ 2వ తేదీన  జరిపే వైద్య ఆరోగ్య ఉత్సవాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారాయన. రాబోయే రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను తాము బహిష్కరిస్తున్నామని అన్నారు.