ఇయ్యాల బీఆర్ఎస్​లో చేరుతున్నా: ఆర్ఎస్​ ప్రవీణ్

ఇయ్యాల బీఆర్ఎస్​లో చేరుతున్నా: ఆర్ఎస్​ ప్రవీణ్

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని  అధినేత కేసీఆర్  సమక్షంలో  సోమవారం బీఆర్ఎస్​పార్టీలో చేరుతున్నట్టు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్​లో ట్వీట్​ చేశారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడటం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఆదివారం హైదరాబాద్​లో  తన రాజకీయ భవితవ్యంపై  వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమథనం జరిపానని.. రకరకాల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. కానీ తన మీద నమ్మకంతో  ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు.