హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధినేత కేసీఆర్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్పార్టీలో చేరుతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడటం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఆదివారం హైదరాబాద్లో తన రాజకీయ భవితవ్యంపై వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమథనం జరిపానని.. రకరకాల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. కానీ తన మీద నమ్మకంతో ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు.