
- చెక్కు అందజేసిన 2014 ఎస్సై బ్యాచ్మేట్స్
అశ్వారావుపేట/నల్లబెల్లి, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) దశదినకర్మను ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో కుటుంబసభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా 2014 బ్యాచ్ ఎస్సైలు, ఏపీ, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుపై రూ .25 లక్షల ఆర్థిక సాయం చేశారు. దీనికి సంబంధించిన చెక్కును ఎస్సై భార్య కృష్ణవేణి తో పాటు కొడుకు, బిడ్డకు అందజేశారు. ముందుగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.