ఆరో రోజూ ప్రైవేట్ బస్సుల తనిఖీ ..5 కేసులు, రూ.11వేల జరిమానా

ఆరో రోజూ ప్రైవేట్ బస్సుల తనిఖీ ..5 కేసులు, రూ.11వేల జరిమానా

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న ప్రైవేట్​బస్సులపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆరో రోజైన గురువారం నగరంలో ప్రైవేట్​ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఈస్ట్​జోన్​పరిధిలో కమర్షియల్​గూడ్స్​ రవాణా చేస్తున్న ఒక బస్సు పై అధికారులు కేసు నమోదు చేసి రూ. 2 వేల జరిమానా విధించారు. అలాగే కమర్షియల్ గూడ్స్​తరలింపుతోపాటు ఫైర్​సేఫ్టీ, ఎమర్జెన్సీ అలారం లేని నాలుగు బస్సులపై కేసులు నమోదు చేసి రూ.9 వేల జరిమానా విధించారు. ఆరు రోజుల్లో మొత్తం 214 కేసులు నమోదు చేసిన అధికారులు.. 9 బస్సులను సీజ్​ చేశారు. జరిమానాగా రూ.5.05 లక్షలు వసూలు  చేశామన్నారు.