పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మే 23 మంగళవారం ఉదయం హైదరాబాద్–హన్మకొండ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. జనగామ జిల్లా నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ సమీపంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెల్లింది.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలైయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. గాయపడిన వారిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. సాంకేతిక లోపం వల్ల బస్సు స్టీరింగ్ లాక్ అవ్వడంతో.. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ చెబుతున్నాడు.