
హైదరాబాద్సిటీ, వెలుగు: గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు గ్రేటర్ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 75 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్, పటాన్చెరు, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, హయత్నగర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, రామ్నగర్, చార్మినార్, ఉప్పల్, కేపీహెచ్బీ కాలనీ, ఓల్డ్ బోయిన్పల్లి, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి నేరుగా గోల్కొండకు ఈ బస్సులు నడుస్తాయన్నారు.