భక్తులకు RTC గుడ్ న్యూస్.. గోల్కొండ బోనాలకు స్పెషల్ బస్సులు

భక్తులకు RTC గుడ్ న్యూస్.. గోల్కొండ బోనాలకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు గ్రేటర్​ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ ​పరిధిలోని 24 డిపోల నుంచి 75 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు. 

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్, పటాన్​చెరు, ఈసీఐఎల్ ​క్రాస్​రోడ్స్, మెహదీపట్నం, దిల్​సుఖ్​నగర్, హయత్​నగర్, కూకట్​పల్లి, రాజేంద్రనగర్, రామ్​నగర్, చార్మినార్, ఉప్పల్, కేపీహెచ్​బీ కాలనీ, ఓల్డ్​ బోయిన్​పల్లి, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి నేరుగా గోల్కొండకు ఈ బస్సులు నడుస్తాయన్నారు.