ఆర్టీసీలోఎన్నికలు జరపాల్సిందే: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీలోఎన్నికలు జరపాల్సిందే: అశ్వత్థామరెడ్డి

రాష్ట్ర ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని, ఎన్నికలు జరపాల్సిందేనని  ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. రెండు సంవత్సరాలు వరకు ఎన్నికలు వద్దని బలవంతంగా కార్మికుల దగ్గర సంతకాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. వెయ్యి బస్సులను తగ్గించి పని భారం పెంచుతున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు తృప్తిగా పనిచేయడం లేదన్నారు అశ్వత్థామరెడ్డి.