గడువు ముగుస్తుంది: భవిష్యత్ కార్యాచరణపై RTC JAC ఫోకస్

గడువు ముగుస్తుంది: భవిష్యత్ కార్యాచరణపై RTC JAC  ఫోకస్

ఇవాళ అర్థరాత్రితో సర్కార్ పెట్టిన డెడ్ లైన్ ముగుస్తుండటంతో…. భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది RTC JAC. ఉద్యోగ సంఘాల కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జేఏసీ నేతలు. మీటింగ్ కు ఆర్టీసీ జేఏసీ ముఖ్య నేతలతో పాటు… రాజకీయ, ట్రేడ్ యూనియన్లు హాజరయ్యాయి. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే… సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది జేఏసీ.

మరోవైపు  సర్కార్  డెడ్ లైన్ ను  లైట్ తీసుకుంది ఆర్టీసీ జేఏసీ.  ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకుండా కార్మికులు ఎవరూ విధుల్లో చేరరని స్పష్టం చేశారు జేఏసీ నేతలు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే…. సమ్మె విరమించడానికి సిద్ధమన్నారు జేఏసీ లీడర్లు.  కార్మికులెవరూ అధైర్యపడొద్దని చెబుతున్నారు.