కౌంటర్ వద్దు.. వాదనలు వినిపిద్దాం

కౌంటర్ వద్దు.. వాదనలు వినిపిద్దాం

లాయర్​ సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సర్కారు శనివారం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేయొద్దని జేఏసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. జేఏసీ లాయర్​ దేశాయ్​ ప్రకాశ్​రెడ్డితో పలువురు నేతలు ఆదివారం భేటీ అయి చర్చించారు. సర్కారు అఫిడవిట్​పై కౌంటర్ దాఖలు చేయాలని తొలుత భావించినా.. లాయర్​ సూచనతో నిర్ణయం మార్చుకున్నట్టు నేతలు తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి అఫిడవిట్ వద్దని సీజే కొద్దిరోజుల కిందే స్పష్టం చేశారని, అయినా సర్కారు అఫిడవిట్​ దాఖలు చేసిందని న్యాయవాది చెప్పారని వివరించారు. ప్రభుత్వ అఫిడవిట్ ను సీజే అంగీకరించకపోవచ్చని, దానిపై విచారణలో దీటుగా వాదనలు వినిపిస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం.