హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాబు ఆరోపించారు. మేనేజ్మెంట్ వైఫల్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గూడ్స్ రవాణా తీసుకురావాలని సీఎం హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా అమలు చేయడంలేదన్నారు. ఉద్యోగ భద్రతకు సంబంధించిన సర్క్యూలర్ కూడా విడుదల చేయడంలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్లో1000 కోట్లు పెట్టాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలం వేతనాన్ని మార్చి 31లోగా చెల్లిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.