ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోం: కోదండరాం

ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోం: కోదండరాం

తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ ఆఫీసులో జరిగిన విపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేబినెట్‌ భేటీలో కార్మికుల సమ్మెపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్మికులందరినీ వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆర్టీసీ సమ్మెను ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు కోదండరాం.