
జూన్ 25న అమావాస్య సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు. వందకు పైగా భక్తులు పాల్గొన్నారు. లోక కల్యాణం కోసం రుద్రహోమం నిర్వహించినట్లు పండితులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో జి.మనోహర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.