రవితేజకు జంటగా రుక్మిణీ వసంత్

రవితేజకు జంటగా రుక్మిణీ వసంత్

రుక్మిణీ వసంత్.. కన్నడ హీరోయిన్‌‌ అయినా  తెలుగులోనూ తనకంటూ ఓ ఇమేజ్‌‌ను తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఫేమ్ రాగా, టాలీవుడ్‌‌లో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కథలు విన్న ఆమె.. తాజాగా తన మొదటి తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. రవితేజకు జంటగా కనిపించే క్రేజీ చాన్స్ అందుకుందట.  ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ ఇప్పటికే రవితేజ కోసం ఓ కథను సిద్ధం చేశాడని, అందులో హీరోయిన్‌‌గా రుక్మిణీని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

అనుదీప్ చెప్పిన కథ నచ్చి ఆమె వెంటనే ఓకే చెప్పేసిందట. ఇప్పటికే యంగ్ హీరో రామ్‌‌ సినిమాలో తను హీరోయిన్‌‌గా ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. అలాగే విజయ్ దేవరకొండ చిత్రంలోనూ సెకెండ్ హీరోయిన్‌‌గా నటిస్తోందనే న్యూస్ వైరల్ అవుతుంది. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  ఇవే కనుక నిజమైతే.. ఇప్పటికే అనుష్క శెట్టి, పూజా హెగ్డే, ర‌‌ష్మిక మంద‌‌న్న, కృతి శెట్టి, అమృత అయ్యర్‌‌, ఆషిక రంగ‌‌నాథ్ లాంటి శాండిల్‌‌వుడ్ హీరోయిన్స్ తెలుగులో సక్సెస్‌‌ఫుల్‌‌గా కొనసాగుతుండగా,ఈ  లిస్టులోకి ఈమె కూడా చేరినట్టు అవుతుంది.