
ముంబై : చమురు ధరలు తగ్గడం, మిడిల్ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాల మధ్య రూపాయి మంగళవారం డాలర్తో పోలిస్తే 73 పైసలు లాభపడి 86.05 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు ఐదేళ్లలో రూపాయికి ఇదే అతిపెద్ద ఒక్కరోజు లాభం. 2020 సెప్టెంబర్ 1న కూడా రూపాయి విలువ 73పైసలు పెరిగింది. డాలర్ బలహీనపడటం, దేశీయ స్టాక్ మార్కెట్లు రూపాయిని మరింత బలోపేతం చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రకటించిన తర్వాత, అంతర్జాతీయ చమురు బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడ్లో 3.19 శాతం పడిపోయి బ్యారెల్ ధర 69.20 డాలర్లకు చేరుకుంది.