డిమాండ్లను పరిష్కరించకపోతే .. ఆమరణ నిరహార దీక్ష 

డిమాండ్లను పరిష్కరించకపోతే .. ఆమరణ నిరహార దీక్ష 

బషీర్ బాగ్, వెలుగు: సమస్యల పరిష్కారానికి గ్రామీణ డాక్ సేవకులు ఆందోళన బాట పట్టారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరాహారదీక్షలో భాగంగా మంగళవారం అబిడ్స్ లోని డాక్ సదన్ వద్ద గ్రామీణ డాక్ సేవకుల ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్రం, తపాలా శాఖ నిర్లక్ష్యం  చేస్తున్నాయని జేఏసీ చైర్మన్ కోటేశ్వరరావు, కన్వీనర్ బండి జయరాజు ఆరోపించారు. 11 డిమాండ్లను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.