రిషి సునాక్‌కు మోదీ స్పెషల్ గిఫ్ట్‌

రిషి సునాక్‌కు మోదీ స్పెషల్ గిఫ్ట్‌

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ప్రస్తుతం అధికార పర్యటన నిమిత్తం యూకేలో ఉన్నారు.  తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన.. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ తరుపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.  

అంతేకాకుండా గణేషుడి విగ్రహంతో పాటుగా టీమిండియా స్టార్ క్రికెటర్  విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను  యూకే ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.  

దీపావళి  పండుగ రోజున ప్రధానమంత్రి రిషి సునాక్‌ దంపతులను కలుసుకోవడం చాలా అనందంగా ఉందన్నారు  జైశంకర్‌.  ఈ సందర్భంగా తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.   జైశంకర్  యూకే పర్యటన  నవంబర్ 15 వరకు కొనసాగనుంది.  అక్కడ జైశంకర్‌ కౌంటర్ జేమ్స్ క్లీవర్లీతో సమావేశం కావాల్సి ఉంది.